సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించాలి: చాడ
ABN , First Publish Date - 2020-03-29T11:17:55+05:30 IST
సింగరేణి బొగ్గు గనుల్లోనూ లాక్డౌన్ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ ఆయన లేఖ రాశారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు వెంటిలేషన్ ఉండదని,
సింగరేణి బొగ్గు గనుల్లోనూ లాక్డౌన్ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ ఆయన లేఖ రాశారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు వెంటిలేషన్ ఉండదని, వారిలో ఏ ఒక్కరికీ కరోనా వైరస్ వ్యాపించినా.. అందరికీ అంటుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో గనిలో 500ల నుంచి 1500 మంది వరకు కార్మికులు పనిచేస్తుంటారని, విద్యుత్తు ఉత్పత్తికి సరిపడు బొగ్గును ఓపెన్కా్స్టల నుంచి వెలికితీసే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన విన్నవించారు.