నేటి నుంచి తిరిగి లాక్డౌన్ నిబంధనలు కఠినతరం
ABN , First Publish Date - 2020-07-14T11:45:53+05:30 IST
రాజంపేట డివిజన్లో కరోనా కేసులు విజృంభిస్తూ ఉండటంతో కరో నా లాక్డౌన్ నిబంధనలను తిరిగి కట్టుదిట్టం చేయాలని
రాజంపేట, జూలై 13 : రాజంపేట డివిజన్లో కరోనా కేసులు విజృంభిస్తూ ఉండటంతో కరో నా లాక్డౌన్ నిబంధనలను తిరిగి కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోఒక్కసారిగా అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో అధికారులు చేసేది లేక లాక్డౌన్ కట్టు దిట్టం చేస్తున్నారు.
రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి నేతృత్వంలో రాజంపేట, రైల్వేకోడూరు, నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, పుల్లంపేట, ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ఉద యం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే నిత్యావసర దుకాణాలు పెట్టాలని, 2గం టల నుంచి నిత్యావసరాల దుకాణాలు పెట్టరాదని నిర్ణయించారు. ఈ మేరకు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అన్ని పోలీ్సస్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నా రు. రాజంపేట పట్టణంలో సోమవారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మధ్యాహ్నం పైబడి తిరిగితే చర్యలు తీసుకుంటాం.. : డీఎస్పీ
మంగళవారం నుంచి రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో మధ్యాహ్నం 2గంటల వరకే నిత్యావసర దుకాణాలు పెట్టుకోవాలన్నారు. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఉన్నతాధికారులతో సంప్రదించి నిబంధనలు మరింత కఠినతరం చేస్తామన్నారు.