Lockdown ఉల్లంఘన.. 3,174 మందిపై కేసులు

ABN , First Publish Date - 2022-01-11T18:09:52+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభుత్వం అమలు చేసింది. దీనిని విజయవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ము

Lockdown ఉల్లంఘన.. 3,174 మందిపై కేసులు

                        - రూ.6.50 లక్షల అపరాధం 


అడయార్‌(చెన్నై): కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభుత్వం అమలు చేసింది. దీనిని విజయవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను విధిగా పాటించాలని, అనవసరంగా రోడ్లపై తిరగొద్దని పదేపదే హెచ్చరికలు చేశారు. కానీ, చాలామంది రోడ్లపై యధేచ్చగా తిరిగారు. ఇలాంటివారిని గుర్తించి మొత్తం 3,174 మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ.6,34,800ల అపరాధం విధించారు. అదేవిధంగా 1112 మోటార్‌ సైకిళ్లను, 49 ఆటోలు, 40 మినీ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-11T18:09:52+05:30 IST