13 నగరాల్లోనే లాక్డౌన్ 5.0... మిగిలిన చోట్ల తెరుచుకోనున్న హోటళ్లు, మాల్స్?
ABN , First Publish Date - 2020-05-30T14:13:55+05:30 IST
లాక్డౌన్ 4.0 ముగుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో జూన్ 1 నుండి దేశంలోని చాలా ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయనున్నట్లు....
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4.0 ముగుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో జూన్ 1 నుండి దేశంలోని చాలా ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 13 నగరాలు మినహా మిగతా అన్నిచోట్లా ఆంక్షలను ఎత్తివేయవచ్చని సమాచారం. హోటళ్ళు, మాల్స్, రెస్టారెంట్లను కూడా జూన్ 1 నుండి తెరవడానికి అనుమతినిస్తారని భోగట్టా. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణే, హైదరాబాద్, కోల్కతా, హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో లాక్డౌన్ ఆంక్షలను కొంతకాలం కొనసాగించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో జూన్ 1 నుండి హోటళ్ళు, మాల్స్, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతి లభించవచ్చు. అయితే దశలవారీగా వీటికి అనుమతులు లభించనున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో లాక్డౌన్ 5.0కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారని సమాచారం.