సన్నద్ధతలో భాగంగానే లాక్‌డౌన్‌: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-29T08:26:45+05:30 IST

ఎలాంటి ప్రణాళిక లేకుండా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఎంతో ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార...

సన్నద్ధతలో భాగంగానే లాక్‌డౌన్‌: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 28: ఎలాంటి ప్రణాళిక లేకుండా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఎంతో ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విమానాశ్రయాల వద్ద అంతర్జాతీయ ప్రయాణికుల స్ర్కీనింగ్‌ను జనవరి 18న ప్రారంభించామని, జనవరి 30న భారత్‌లో మొదటి కేసు నమోదైందని గుర్తుచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ వో) కూడా జనవరి 30న అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిందని తెలిపింది.  

Updated Date - 2020-03-29T08:26:45+05:30 IST