సన్నద్ధతలో భాగంగానే లాక్డౌన్: కేంద్రం
ABN , First Publish Date - 2020-03-29T08:26:45+05:30 IST
ఎలాంటి ప్రణాళిక లేకుండా భారత్లో లాక్డౌన్ విధించారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఎంతో ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార...
న్యూఢిల్లీ, మార్చి 28: ఎలాంటి ప్రణాళిక లేకుండా భారత్లో లాక్డౌన్ విధించారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఎంతో ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విమానాశ్రయాల వద్ద అంతర్జాతీయ ప్రయాణికుల స్ర్కీనింగ్ను జనవరి 18న ప్రారంభించామని, జనవరి 30న భారత్లో మొదటి కేసు నమోదైందని గుర్తుచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కూడా జనవరి 30న అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిందని తెలిపింది.