నస్రుల్లాబాద్లో లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-19T04:11:22+05:30 IST
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం నుంచి లాక్డౌన్ కొనసాగుతు న్నట్లు గ్రామస్థులు తెలిపారు.
నస్రుల్లాబాద్, ఏప్రిల్ 18 : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం నుంచి లాక్డౌన్ కొనసాగుతు న్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు మాత్రమే దుకాణ, వ్యాపార సముదాయా లు తెరచి ఉంచాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపార సముదాయాలు, దుకాణాలు తెరచి ఉంచితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. కరోనా వైరస్ దష్ట్యా గ్రామస్థులు, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలని కోరారు.