నింగిలోకి ధరలు.. సామాన్యుడు బతికేదెలా..?
ABN , First Publish Date - 2021-05-18T19:17:03+05:30 IST
చమురుధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో నిత్యవసర ధరలు...
హైదరాబాద్: చమురుధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బతికేదెలా? మరోవైపు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ముచేసుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ అసలే ఆధాయం లేక విలవిల్లాడిపోతున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. వంట గ్యాస్ పరిస్థితి అలా ఉంటే.. వంట నూనెల ధరలు కూడా నింగినంటుతున్నాయి. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. నూనెలు కొనాలంటే చేతి చములు వదులుతోంది.
గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ధరలు పెరిగాయి. విజయ పల్లి నూనె గరిష్ఠ లీటరు ధర రూ. 198 ఉంది. ప్రైవేటు కంపెనీల పల్లి నూనెల ధరలు రూ. 220కిపైగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు నూనె ధర రూ. 175 నుంచి 195 వరకు ఉంది. మండుతున్న నూనె ధరలకు తోడు రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. లాక్ డౌన్తో రోజుకు నాలుగు గంటలే కొనుగోళ్లకు సమయం ఉండడంతో.. ఇదే అదనుగా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.