చీనీ రైతుకు లాక్‌డౌన్‌ శాపం

ABN , First Publish Date - 2020-03-27T07:54:18+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ రైతుల పాలిట శాపంగా మారింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లెకి చెందిన రైతు వల్లపు ఓబయ్య, పల్లపు ఓబులేసు చీనీ కాయలను...

చీనీ రైతుకు లాక్‌డౌన్‌ శాపం

కొలిమిగుండ్ల, మార్చి 26: కరోనా లాక్‌డౌన్‌ రైతుల పాలిట శాపంగా మారింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లెకి చెందిన రైతు వల్లపు ఓబయ్య, పల్లపు ఓబులేసు చీనీ కాయలను మంగళవారం బెంగళూరు మార్కెట్‌కు తీసుకు వెళ్లారు. కరోనా ప్రభావంతో మార్కెట్‌లో వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ రైతులు 8 టన్నుల చీనీ కాయలను అక్కడే వదిలేసి వచ్చారు. వాటి విలువ రూ.4 లక్షలకు పైగా ఉంటుందని రైతులు బాధిత కంటతడి పెట్టారు.  


Updated Date - 2020-03-27T07:54:18+05:30 IST