లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలి: అసదుద్దీన్
ABN , First Publish Date - 2020-05-31T08:59:33+05:30 IST
ఎలాంటి నిబంధనలు లేకుండా లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రెండు నెలలకు పైగా లాక్డౌన్తో...
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి నిబంధనలు లేకుండా లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రెండు నెలలకు పైగా లాక్డౌన్తో సాధించిందేమిటని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. లాక్డౌన్ అమలు చేస్తూ ఒక సారి చప్పట్లు కొట్టాలని, మరో సారి దీపాలు వెలిగించాలని పిలుపు ఇచ్చి కరోనాను నిలువరించారా? అని అడిగారు. పేదలను నిర్బంధించి ఉపాధి లేకుండా చేసి ఆకలి చావులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జైపూర్-బిహార్ రహదారిపై ఆకలికి తాళ లేక వలస కార్మికుడు శునకం కళేబరాన్ని తింటున్న దృశ్యాలు తనను కలిచివేశాయన్నారు.