‘ఏపీవై’ పాక్షిక ఉపసంహరణకు అనుమతి
ABN , First Publish Date - 2020-04-10T08:46:09+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో అసంఘటిత రంగంలోని కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం ...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: లాక్డౌన్ నేపథ్యంలో అసంఘటిత రంగంలోని కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం నుంచి పాక్షిక నగదు ఉపసంహరణకు లబ్దిదారులను అనుమతించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలువడే అవకాశముందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్పమెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ తెలిపారు. కార్మికులకు తమ వాటా నుంచి 25ు వరకు ఉపసంహరించుకోవచ్చు.