లభించని రైతు ఆచూకీ

ABN , First Publish Date - 2022-08-13T04:10:51+05:30 IST

ప్రాణహితలో మండలంలోని పాపన్నపేట గ్రామానికి చెందిన మడె భగవాన్‌ అనే రైతు ఆచూకీ లభించలేదు. భగవాన్‌ గ్రామ సమీపంలోని పంట చేనుకు వెళ్లేందుకు గురువారం బ్యాక్‌వాటర్‌ వరదను దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద నీటిలో మునిగిపోయాడు

లభించని రైతు ఆచూకీ
గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న అధికారులు

బెజ్జూరు, ఆగస్టు 12: ప్రాణహితలో  మండలంలోని పాపన్నపేట గ్రామానికి చెందిన మడె భగవాన్‌ అనే రైతు ఆచూకీ లభించలేదు. భగవాన్‌ గ్రామ సమీపంలోని పంట చేనుకు వెళ్లేందుకు గురువారం బ్యాక్‌వాటర్‌ వరదను దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద నీటిలో మునిగిపోయాడు.  భగవాన్‌ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకడం లేదు. శుక్రవారం తహసీల్దార్‌ జమీర్‌, ఎస్సై వెంకటేష్‌, సర్పంచ్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో నాటు పడవల ద్వారా గజ ఈతగాళ్ల సహాయంతో. సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ వరద ఉధృతి అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. 

Updated Date - 2022-08-13T04:10:51+05:30 IST