కూపన్ ఉంటే చాలు.. కూరగాయలన్నీ ఫ్రీ.. ఎక్కడంటే?
ABN , First Publish Date - 2020-05-21T01:15:29+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా దేశం స్తంభించిపోయింది. దీంతో ముఖ్యంగా పేదలు నానాఇబ్బందులూ పడుతున్నారు.
కోల్కతా: కరోనా మహమ్మారి కారణంగా దేశం స్తంభించిపోయింది. దీంతో ముఖ్యంగా పేదలు నానాఇబ్బందులూ పడుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జాదవ్పూర్ వాసులు పేదలకు అండగా నిలవాలనుకున్నారు. దీనికోసం ఉచితంగా కూరగాయలు అందజేసేందుకు ఏకంగా ఓ వెజిటెబుల్ మార్కెట్ను ఏర్పాటుచేశారు. ఈ మార్కెట్ కూపన్లు సంపాదించిన వ్యక్తులు.. మార్కెట్లో తమకు కావలసిన సరుకులను తీసుకెళ్లవచ్చు. స్థానికులను ఈ ఫ్రీ మార్కెట్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ మార్కెట్ ఆలోచన స్థానిక సీపీఐ(ఎం) నేతలదని సమాచారం.