నుపుర్ శర్మ వ్యాఖ్యల దుమారం: బెంగాల్‌లో లోకల్ ట్రైన్‌ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు

ABN , First Publish Date - 2022-06-13T01:48:20+05:30 IST

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృతనేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ

నుపుర్ శర్మ వ్యాఖ్యల దుమారం: బెంగాల్‌లో లోకల్ ట్రైన్‌ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు

కోల్‌కతా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృతనేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు చెలరేగిపోయారు. ఫలితంగా ఆందోళన హింసాత్మకంగా మారింది. నదియా జిల్లాలోని బేతుఆదహరి రైల్వే స్టేషన్‌లో లోకల్ ట్రైన్‌పై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. ఆపై రైలుపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. 

Updated Date - 2022-06-13T01:48:20+05:30 IST