పంచాయతీ ఎన్నికలలో టీడీపీదే గెలుపు: కేఈ

ABN , First Publish Date - 2021-01-27T06:30:38+05:30 IST

పంచాయతీ ఎన్నికలలో గెలుపు టీడీపీదేనని ఆ దిశగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

పంచాయతీ ఎన్నికలలో టీడీపీదే గెలుపు: కేఈ

పత్తికొండ/ మద్దికెర, జనవరి 26: పంచాయతీ ఎన్నికలలో గెలుపు టీడీపీదేనని ఆ దిశగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో ఆయనను కలిశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో కేఈ కృష్ణమూర్తి మండలాల నాయకులు, కార్యకర్తలతో పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అన్ని పంచాయతీల్లో అన్ని స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు బరిలో నిలుస్తారన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నాయకులు బత్తిన వెంకటరాముడు, సాంబశివారెడ్డి, మనోహర్‌చౌదరి, రామానాయుడు, లోక్‌నాథ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:30:38+05:30 IST