స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జగ్గారెడ్డి భార్య

ABN , First Publish Date - 2021-11-23T04:14:01+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నుంచి తన సతీమణి నిర్మల పోటీ చేయనుందని ...

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జగ్గారెడ్డి భార్య

సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నుంచి తన సతీమణి నిర్మల పోటీ చేయనుందని చెప్పారు. సరైన బలం లేకున్నా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తమకున్న ఓట్లు కాపాడుకోవడంతో పాటు.. అధికార పార్టీలో ఉన్న ఓట్లు కూడా వేస్తారని భావిస్తున్నామన్నారు. నిధులు, విధులు లేక అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అసంతృప్తి‌తో ఉన్నారని తెలిపారు. వారి ఓట్లు తమకు క్రాస్ అవుతాయని అనుకుంటున్నామన్నారు. మెదక్‌తోపాటు కొన్ని జిల్లాలో పోటీ చేయాలని చూస్తున్నామని చెప్పారు, ఎన్ని జిల్లాలో పోటీ చేయాలనేది మంగళవారం స్పష్టత వస్తుందని జగ్గారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-11-23T04:14:01+05:30 IST