సొసైటీ ద్వారా రైతులకు రుణాలు
ABN , First Publish Date - 2020-10-01T08:50:29+05:30 IST
సొసైటీ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని సొసైటీ చైర్పర్సన్ దొంగ నాగేశ్వరరావు అన్నారు.
అంబాజీపేట, సెప్టెంబరు 30: సొసైటీ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని సొసైటీ చైర్పర్సన్ దొంగ నాగేశ్వరరావు అన్నారు. గంగలకుర్రు సొసైటీ కార్యాలయంలో సీఈవో ఎం.కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సొసైటీ ద్వారా రైతులకు రుణాలు, ఎరువులను అందించారు. అనంతరం రైతులకు శానిటైజర్లు, మాస్కులను అందించారు. ఈ సమావేశంలో పెదమల్లు గుప్తా, నెల్లి ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.