రుణాలు సకాలంలో చెల్లించాలి

ABN , First Publish Date - 2022-05-25T05:43:06+05:30 IST

రుణాలు సకాలంలో చెల్లించాలి

రుణాలు సకాలంలో చెల్లించాలి

శంషాబాద్‌, మే 24: డ్వాక్రాగ్రూపులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మా మహేందర్‌రెడ్డి సూచించారు. మున్సిపల్‌ కేంద్రంలో మంగళవారం డ్వాక్రా గ్రూపుల ఫెడరేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సాబేర్‌ అలీ, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:43:06+05:30 IST