ప్రశాంతంగా జీవించాలి : సీఐ
ABN , First Publish Date - 2021-06-24T05:06:37+05:30 IST
చిన్నచిన్న సమస్యలకు గొడవలు పడకుండా ప్రశాంతంగా జీవించాలని జమ్మలమడుగు రూరల్ సీఐ మంజునాధరెడ్డి పేర్కొన్నారు.
మైలవరం, జూన్ 23: చిన్నచిన్న సమస్యలకు గొడవలు పడకుండా ప్రశాంతంగా జీవించాలని జమ్మలమడుగు రూరల్ సీఐ మంజునాధరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం మండలంలో ఫ్యాక్షన్ గ్రామాలైన చిన్నకొమెర్ల, పెద్దకొమెర్లలో నాకాబందీ నిర్వహించారు. పలువురి నేతల ఇళ్లలో, గడ్డివాముల్లో సోదాలు చేపట్టారు. అనంతరం ప్రజలతో సమావేశమై ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. గొడవలు పడితే... జీవితాలు నాశనమవుతాయన్నారు. కార్యక్రమంలో తలమంచిపట్నం, మైలవరం, పెద్దముడియం ఎస్ఐలు ధనుంజయుడు, ప్రవీణ్కుమార్, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.