మద్యం దుకాణంలో చోరీ
ABN , First Publish Date - 2021-01-16T05:45:51+05:30 IST
మద్యం దుకాణంలో చోరీ
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి విఠాయిపల్లి గ్రామ సమీపంలో గల దుర్గావైన్స్లో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు గురువారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. కాగా దుండగులు దుకాణం వెనుక భాగంలోని రేకులు, ఇనుప చువ్వలను కట్టర్తో తొలగించి లోపలికి ప్రవేశించారు. రూ.70వేల విలువ చేసే మద్యం, టీవీ, హార్డ్డిస్క్, రెండు సీసీ కెమరాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు శ్రీనివాస్, శ్రీను, చంద్రశేఖర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ ధర్మేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.