Mlc Kavitha: ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో తెలియదు
ABN , First Publish Date - 2022-08-28T00:45:56+05:30 IST
తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. లిక్కర్ స్కామ్ లో...
హైదరాబాద్: తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. లిక్కర్ స్కామ్ లో (liquor Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో ఆమె మాట్లాడుతూ తాను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో తనకు తెలియదన్నారు. ఆధారాలు లేని ఆరోపణలకు ఊతం ఇవ్వరాదని చెప్పారు. ప్రైవేటు సంభాషణలను వక్రీకరించి రాయవద్దని ఆమె వ్యాఖ్యానించారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని.. తెలంగాణలోనూ కుట్ర చేస్తోందని కవిత మండిపడ్డారు.