ఒకే రోజు రూ.218 కోట్ల Liquor విక్రయం

ABN , First Publish Date - 2022-01-10T16:47:51+05:30 IST

టాస్మాక్‌ చిల్లరదుకాణాల్లో శనివారం ఒకేరోజు రూ.218 కోట్లకు పైగా మద్యం విక్రయమైంది. చెన్నై మండలంలో మాత్రమే రూ.50.04 కోట్లు, తిరుచ్చి

ఒకే రోజు రూ.218 కోట్ల Liquor విక్రయం

చెన్నై/ప్యారీస్‌: టాస్మాక్‌ చిల్లరదుకాణాల్లో శనివారం ఒకేరోజు  రూ.218 కోట్లకు పైగా మద్యం విక్రయమైంది. చెన్నై మండలంలో మాత్రమే రూ.50.04 కోట్లు, తిరుచ్చి మండలంలో రూ.49.52 కోట్లు, సేలంలో మండలం లో రూ.40.85 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని టాస్మాక్‌ అధి కారులు తెలిపారు. మదురై మండలంలో రూ.43.20 కోట్లు, కోయం బత్తూరు మండలంలో రూ.41.28 కోట్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రూ.218.96 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడంతో మందుబాబులు ముందుగానే మద్యాన్ని కొనుగోలు చేయడంతో ఈ స్థాయిలో విక్రయాలు జరిగాయని అధికారులు వివరించారు.

Updated Date - 2022-01-10T16:47:51+05:30 IST