మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్?

ABN , First Publish Date - 2021-05-11T22:32:01+05:30 IST

కర్ఫ్యూ రిలీఫ్ టైమ్‌లో మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేయగా..

మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్?

హైదరాబాద్: మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కర్ఫ్యూ రిలీఫ్ టైమ్‌లో మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేయగా.. కాసేపట్లో ప్రభుత్వం ప్రకటించనుంది. మద్యం షాపులను మినహాయించుకుంటే.. ఖజానాకు భారీగా కోత పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. 


ఇదిలా ఉంటే, రేపటి నుంచి పది రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టుతో సహా పలువురు లాక్‌డౌన్ విధించడమే సరైన మార్గమని చెబుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది.   

Updated Date - 2021-05-11T22:32:01+05:30 IST