చీప్‌ లిక్కర్‌ రూ.10 పెరిగింది!

ABN , First Publish Date - 2022-06-24T06:20:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం మందుబాబులపై భారం మోపుతోంది.

చీప్‌ లిక్కర్‌ రూ.10 పెరిగింది!

రాపూరు, జూన్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం మందుబాబులపై భారం మోపుతోంది. గతంలో బ్రాందీషాపుల్లో చీప్‌ లిక్కర్‌ తో సహా అన్ని బ్రాండ్ల ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలో పరవళ్లు తొక్కింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో చీప్‌ లిక్కర్‌ బ్రాందీ కనీస ధర రూ.120 ఉండేది. కొన్నిరోజులుగా కనీస ధర రూ.10 పెంచడంతో రూ.130 చేరుకుంది. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ మద్యం షాపుల్లో మరో రూ.10 పెంచేసిందని మందుబాబులు వాపోతున్నారు. 

Updated Date - 2022-06-24T06:20:31+05:30 IST