12 నుంచి మద్యం దుకాణాల మూసివేత

ABN , First Publish Date - 2021-03-02T06:26:22+05:30 IST

12 నుంచి మద్యం దుకాణాల మూసివేత

12 నుంచి మద్యం దుకాణాల మూసివేత

వన్‌టౌన్‌, మార్చి 1 : కృష్ణా, గుంటూరు ఉపాధ్యా య నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  ఈ నెల 12 నుంచి 14 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఇంతియాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన తేదీల్లో పోలింగ్‌ ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 17న  ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు జిల్లా అంతటా డ్రైడేగా ప్రకటించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-02T06:26:22+05:30 IST