మంచానికే పరిమితమై....
ABN , First Publish Date - 2021-01-27T04:57:21+05:30 IST
మంచాని కే పరిమితమై జీవచ్ఛవంలా బతుకుతున్నాడని, దాతలు సాయం చేసి ఆదుకోవాలని రాయిన బోయిన సుబ్బరావు తల్లి వేడుకుం టోంది.
మైదుకూరు రూరల్, జనవరి 26: మంచాని కే పరిమితమై జీవచ్ఛవంలా బతుకుతున్నాడని, దాతలు సాయం చేసి ఆదుకోవాలని రాయిన బోయిన సుబ్బరావు తల్లి వేడుకుం టోంది. యాపరాపల్లెలో కూలీ పని చేసు కుంటూ జీవనం సాగిస్తున్న సుబ్బారావు గత ఏడాది విద్యుదా ఘాతానికి గురయ్యాడు.
అప్పటి నుంచి చేతులు, కాళ్లు కదిలించలేని పరిస్థితి. దీంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని బం ధువులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు ఆలన పాల నా తల్లే చూసుకుంటోంది. ఇప్పటికే సుమారు రూ.12 లక్ష లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు వా పోతున్నారు. కుటుంబ పోషణ కూడా బరువైందని ప్రభు త్వం నుంచి కానీ, దాతలు సహకరిచాలని టీడీపీ జిల్లా నాయకులు ధనపాల యుగంధర్ కోరుతున్నారు.