చెత్త ఇలా - పారుదల ఎలా?
ABN , First Publish Date - 2021-04-17T04:42:18+05:30 IST
సగిలేటిలో చెత్త వేయ డంతో నీటి పారుదల ఎలాఉంటుందని పలువు రు ప్రశ్నిస్తున్నారు.
సగిలేటిలో పేరుకుపోయిన చెత్త
కలసపాడు, ఏప్రిల్ 16: సగిలేటిలో చెత్త వేయ డంతో నీటి పారుదల ఎలాఉంటుందని పలువు రు ప్రశ్నిస్తున్నారు. అత్యంత జనాభా ఉన్న పెద్ద పంచాయతీ కలసపాడు. ఇక్కడ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ఉంది. కానీ అక్కడ పని చేసే గ్రీన అంబాసిడర్లు చెత్తను తీసుకెళ్లేందుకు జాప్యం చేస్తుండడంతో దుకాణ దారుల నుంచి సేకరించిన ప్లాస్టిక్, కూరగాయల వ్యర్ధాలు, హో టళ్లలో తిని పారేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సగిలేటి లో వేస్తున్నారు.
దీంతో అక్కడ దుర్గంధం వ్యాపి స్తుండడం, సగిలేటిలో చెత్త మొత్తం పేరుకుపోయి నీటి పారుదలకు ఇబ్బందులు తప్పవని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏటిలో నీరు కలుషితమై తాగే వారికి వ్యాధులు సంక్రమి స్తాయని వాపోతున్నారు. ఇలా చేస్తున్నా సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కార్యాలయంలో వివరణ కోరగా పరిశీలించి సంబంధితుల పై చర్యలు చేపడతామని ఏఓ వరదరాజులు తెలిపారు.