పిడుగుపాటుకు 18 ఏనుగులు బలి

ABN , First Publish Date - 2021-05-14T08:15:35+05:30 IST

పిడుగుపాటుకు 18 ఏనుగులు బలయ్యాయి. అసోం నాగోన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని అటవీ శాఖ ఉన్నతాధికారి అమిత్‌ సహాయ్‌ వెల్లడించారు....

పిడుగుపాటుకు 18 ఏనుగులు బలి

పిడుగుపాటుకు 18 ఏనుగులు బలయ్యాయి. అసోం నాగోన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని అటవీ శాఖ ఉన్నతాధికారి అమిత్‌ సహాయ్‌ వెల్లడించారు. ఓ పర్వతంపై 14 ఏనుగులు, ఆ కొండకు దిగువభాగంలో మరో నాలుగు ఏనుగుల కళేబరాలను తమ సిబ్బంది గుర్తించారని ఆయన చెప్పారు. పిడుగు పడటం వల్ల అవి చనిపోయినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. 

Updated Date - 2021-05-14T08:15:35+05:30 IST