స్వల్పంగా కంపించిన భూమి

ABN , First Publish Date - 2020-06-06T09:46:51+05:30 IST

జిల్లా కేంద్రమైన ఒంగోలులో శుక్రవారం భూమి స్వల్పంగా కంపించింది.

స్వల్పంగా కంపించిన భూమి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 5 : జిల్లా కేంద్రమైన ఒంగోలులో శుక్రవారం భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 10.15 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజానీకం భయబ్రాంతులకు గురయ్యారు. నగరంలోని శర్మ కళాశాల, అంబేద్కర్‌ భవన్‌ ప్రాంతం, ఎన్‌జీవో కాలనీ, గద్దలగుంట, మామిడిపాలెం,  సుందరయ్య భవన్‌ రోడ్డు, మంగమూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో ఇళ్లలో వంట గది అరమారాల్లో ఉండే గ్లాసులు ఊగుతున్న శబ్దం రావడంతో ప్రజలకు ఆర్థం కాక ప్రజలకు బయటకు పరుగులు పెట్టారు. అలాగే  త్రిపురాంతకంలో పలు చోట్ల శుక్రవారం మధ్యాహ్నం స్వల్ఫంగా భూ ప్రకంపనలు వచ్చాయి. వైపాలెం రోడ్డు, ఉత్తరపు వీధి, ఉప్పలగుట్ట ప్రాంతాల్లో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. వాంతో  ప్రజలు భయబ్రాంతులకు గురై ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 

Updated Date - 2020-06-06T09:46:51+05:30 IST