లిఫ్టులకు మరమ్మతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-26T06:41:12+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న లిఫ్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, మరమ్మతులు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

లిఫ్టులకు మరమ్మతులు చేపట్టాలి
ఎత్తిపోతల పథకం మోటార్‌ను పరిశీలిస్తున్న జూలకంటి రంగారెడ్డి

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మునగాల రూరల్‌, జూన్‌ 25: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న లిఫ్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, మరమ్మతులు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మునగాల ఎల్‌-33, కలకోవ ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్‌ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేప ట్టి ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనందున యుద్ధ ప్రాతిపదికన అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. కాల్వల పూడికలు, తూముల షట్టర్లు, కాల్వ కట్టలు, రహదారులు పూర్తిచేసి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలన్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నల్లగొండలో నీటిపారుదల సీఈ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో రైతులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సత్యనారాయణ, గోపిరెడ్డి మల్లారెడ్డి, దొంగరి అప్పారావు, మండవ వెంకన్న పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T06:41:12+05:30 IST