ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే

ABN , First Publish Date - 2022-04-04T08:23:27+05:30 IST

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే స్థానంలో మనోజ్‌ పాండే చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జనరల్‌ నరవణే తర్వాత ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండేనే అత్యంత సీనియర్‌గా ఉన్నారు. కాగా జనరల్‌ నరవణే తదుపరి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత డిసెంబరులో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా, పన్నెండు మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గత మూడు నెలల్లో కొంత మంది ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందిన నేపథ్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే అత్యంత సీనియర్‌గా ఉన్నారు.  లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌ శుక్లా (ఏఆర్‌టీఆర్‌ఏసీ) మార్చి 31న రిటైరయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ సీపీ మొహంతీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీలు జనవరి 31 పదవీ విరమణ చేశారు. 


Updated Date - 2022-04-04T08:23:27+05:30 IST