ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-04-21T06:33:12+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలోనూ ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) రికార్డులు తిరగరాస్తోంది. మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ...

ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు

  • 2020-21లో రికార్డు స్థాయికి చేరిక


ముంబై: కొవిడ్‌ నేపథ్యంలోనూ ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ  (ఎల్‌ఐసీ) రికార్డులు తిరగరాస్తోంది. మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ.. కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1.84 లక్షల కోట్లుగా నమోదైంది. ఇందులో  వ్యక్తిగత పాలసీదారులు చెల్లించిన తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.56,406 కోట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 10.11 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎల్‌ఐసీ 2.10 కోట్ల పాలసీలు విక్రయించింది. ఇందులో 46.72 లక్షల పాలసీలు ఒక్క మార్చి నెలలోనే విక్రయించింది. మార్కెట్‌ వాటాపరంగా చూస్తే ఎల్‌ఐసీ ఈ ఏడాది మార్చి నెలలో 81.04 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే 74.58 శాతం మార్కెట్‌ వాటా సాధించింది. ప్రైవేట్‌ బీమా కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఉన్నా ఎల్‌ఐసీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసా గిస్తూ వస్తుండటం విశేషం. 


Updated Date - 2021-04-21T06:33:12+05:30 IST