కేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-08T03:58:47+05:30 IST
మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మెన్ కనకయాదవ్రావ్ సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు.
జైనూర్, డిసెంబరు 7: మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మెన్ కనకయాదవ్రావ్ సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయంలో మెనూ అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా చైర్మెన్ కనకయాదవ్రావ్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందిపై మండి పడ్డారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, నాయకులు రాథోడ్ రాందాస్ ఉన్నారు.