గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-19T04:34:50+05:30 IST
గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
వికారాబాద్, ఆగస్టు 18: గ్రంథాలయాలను మహిళలు, విద్యార్థినులు వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గురువారం మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో రాజా రామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేష న్ తరపున ర్యాలీ నిర్వహించి మహిళలకు అవగాహన కల్పి ంచారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్, డీఆర్వో అశోక్కుమార్, ఎంపీపీ చంద్రకళ, ఎంఈవో బాబూసింగ్, ప్రిన్సిపాల్ రాధమ్మ, చంద్రశేఖర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.