ఎల్జీ యాజమాన్యమే ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-05-30T08:59:45+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం వున్నందున వారిని అన్ని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
పాలిమర్స్ను ప్రభుత్వం వెంటనే తరలించాలి
గోపాలపట్నం, మే 29: ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం వున్నందున వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యానిదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జనావాసాల మధ్య వున్న ఇటువంటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావిత వెంకటాపురంలో ఆయన శుక్రవారం పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాక్షన్ ప్రభుత్వం నడుస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ, ఏకగ్రీవంగా పలు స్థానాల ఎంపిక వంటి అంశాలు దీనికి నిదర్శనమన్నారు. ఆయన వెంట సీపీఐ నేత సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.