జేసీ లేఅవుట్ల పరిశీలన
ABN , First Publish Date - 2021-10-29T02:45:12+05:30 IST
మండలంలోని నార్తుమోపూరు, అల్లూరు గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలాలను జేసీ హరేందిర్ప్రసాద్ గురువారం
అల్లూరు, అక్టోబరు 28 : మండలంలోని నార్తుమోపూరు, అల్లూరు గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలాలను జేసీ హరేందిర్ప్రసాద్ గురువారం పరిశీలించారు. ముందుగా నార్తుమోపూరు స్థలాలను పరిశీలించారు. అనంతరం అల్లూరులో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలను పరిశీలించారు. వీటిపై అవసరమైన సమాచారాన్ని ఆర్డీవో శీనానాయక్ వివరించారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీరామకృష్ణ, సర్వేయర్ శ్రీనివాసులు, వీఆర్వోలు, అధికారులు పాల్గొన్నారు.