విశాఖలో ‘లెవెన్త్‌ అవర్‌’ బృందం సందడి

ABN , First Publish Date - 2021-04-11T06:28:18+05:30 IST

‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుందని హీరో ఆదిత్‌తరుణ్‌ అన్నారు.

విశాఖలో ‘లెవెన్త్‌ అవర్‌’ బృందం సందడి
మాట్లాడుతున్న హీరో ఆదిత్‌తరుణ్‌

ఇదో సరికొత్త వెబ్‌ సిరీస్‌ : హీరో ఆదిత్‌తరుణ్‌

డాబాగార్డెన్స్‌ , ఏప్రిల్‌ 10 :

‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుందని హీరో ఆదిత్‌తరుణ్‌ అన్నారు. తమన్నా కీలక పాత్ర పోషించగా, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ప్రదీప్‌.యు నిర్మించారు. ప్రమోషన్‌లో భాగంగా డాబాగార్డెన్స్‌లోని వీ ప్రైడ్‌ హోటల్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగులో ఈ తరహా కథలకు ఓటీటీ ప్లాట్‌పామ్‌ మంచి అవకాశమని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదలైన తమ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ‘పురుషాధిక్య కార్పొరేట్‌ ప్రపంచంలో ఓ మహిళా సీఈఓ తన కంపెనీని ఎలా కాపాడుకుంది’ అన్న ఇతివృత్తంతో సిరీస్‌ సాగుతుందన్నారు.


చిన్న సినిమాలు ఆహా వంటి ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులకు ఎప్పుడైనా చూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. తొలి సిరీస్‌లో ఎనిమిది భాగాలుంటాయని చెప్పారు. విశాఖలోనే ఆశీలమెట్ట ప్రాంతంలో తాను పుట్టి పెరిగానని తరుణ్‌ తెలిపారు. ఇప్పటికే తాను హీరోగా కథ, 24 కిక్స్‌  చిత్రాల్లో నటించానన్నారు. భవిష్యత్‌లో ఓటీటీలకు మరింత ఆదరణ లబిస్తుందని తెలిపారు. నటుడు విక్రమాదిత్య మాట్లాడుతూ లెవెన్త్‌ ఆవర్‌ ఓటీటీ వెబ్‌ సిరీస్‌ తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.

Updated Date - 2021-04-11T06:28:18+05:30 IST