జగన్కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
ABN , First Publish Date - 2020-03-29T21:32:37+05:30 IST
సీఎం జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. లాక్డౌన్ పేరుతో ప్రజల్ని పోలీసులు అసౌకర్యానికి గురిచేస్తున్నారని, రబీ పంట కోసం నిరంత పర్యవేక్షణ అవసరమన్నారు.
అమరావతి: సీఎం జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. లాక్డౌన్ పేరుతో ప్రజల్ని పోలీసులు అసౌకర్యానికి గురిచేస్తున్నారని, రబీ పంట కోసం నిరంత పర్యవేక్షణ అవసరమన్నారు. పశువుల మేత కోసం గ్రామాల్లో తిరగాల్సిన అవసరం ఉంటుందని, వ్యవసాయ పనులకు హాజరయ్యే రైతులకు ఇబ్బంది కలిగించొద్దని లేఖలో కన్నా లక్ష్మీనారాయణ కోరారు.