Amaravathi: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను CM ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-05-17T14:54:28+05:30 IST

AP Chief minister జగన్మోహన్ రెడ్డికి CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక నివేదికల ప్రకారం ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు

Amaravathi: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను CM ఆదుకోవాలి

అమరావతి: AP Chief minister జగన్మోహన్ రెడ్డికి CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక నివేదికల ప్రకారం ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 2019 జూన్ నుంచి 2021 ఆఖరు వరకు అప్పుల బాధతో రాష్ట్రంలో 2112 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. కాగా జీవో 43 ప్రకారం ఇప్పటి వరకు 718 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందిందని, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు అండగా నిలుస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని రామకృష్ణ సూచించారు.  

Updated Date - 2022-05-17T14:54:28+05:30 IST