లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
ABN , First Publish Date - 2021-06-24T01:20:23+05:30 IST
లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఎంపీ
అమరావతి: లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హతపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్కు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలని గతేడాది జూలై 3న ఇచ్చిన లేఖపై నిర్ణయం తీసుకోకపోవడంపై విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సాపురం ప్రజలకు సరైన ఎంపీని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీకి దూరమైన రఘురామను పార్లమెంట్ సమావేశాలకు హాజరుకానివ్వడం అన్యాయని లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.