టీడీపీకి పూర్వవైభవం తీసుకొద్దాం
ABN , First Publish Date - 2022-06-30T06:01:23+05:30 IST
టీడీపీకి పూర్వవైభవం తీసుకొద్దాం
మంచాల, జూన్ 29: టీడీపీకి పూర్వ వైభవం తీసుకొద్దామని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి సీహెచ్.చక్రపాణి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వంగాలకృష్ణలు పిలుపునిచ్చారు. మండలంలోని ఆరుట్లలో బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుమహిళా రాష్ట్ర కార్యదర్శి మంకుఇందిర, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, ఎండీ.సలాం, ఎన్నిదుల సురేష్, శాకేర్, వెంకట్రెడ్డి, లింగం, పెర్కమూర్తి, నూకంసత్తయ్య, సాతిరిఎల్లేష్, ఎం.శేఖర్, దశరథ్, యాదయ్య పాల్గొన్నారు.