మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపుదాం

ABN , First Publish Date - 2022-06-26T07:19:46+05:30 IST

మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన జగన్‌ మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపుదామని ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపుదాం

గూడూరి ఎరిక్షన్‌ బాబు

పెద్ద దోర్నాల, జూన్‌ 25: మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన జగన్‌ మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపుదామని ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో శనివారం బాదుడే-బాదుడు కార్యక్రమం  నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎరిక్షన్‌బాబుకు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ జగన్‌ ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలుజేసిందని, రాయితీపై వ్యవసాయ ఉప కరణాలను అందజేసిందన్నా రు. నిరుద్యోగ యువతకు నెల కు రూ.2 వేల చొప్పున అన్ని కులాలకు కార్పోరేషన్లు ఏర్పా టు చేసి నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రతి పండుగకు పేదలకు కానుకలు తదితర సంక్షేమ పథకాలు నిరంతరం అమలు చేస్తూనే మరోవైపు  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిం చిందన్నారు. అయితే ప్రస్తుతం అన్ని పథకాలు రద్దు చేసి కరంటు చార్జీలు, ఆర్‌టీసీ బస్సు చార్జీలు, పెట్రోలు, డీజల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచారన్నారు. ఇంటి పన్ను చెత్త పన్ను వేసి సామాన్యుడిపై భారం మోపుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ మన్నె రవీంద్ర, మండల కన్వీనర్‌ ఏర్వ మల్లికార్జునరెడ్డి,  అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్‌రెడ్డి, షేక్‌ మహబూబ్‌ భాష, కాంపల్లి వెంకటేశ్వర్లు, జీ శ్రీనివాసరెడ్డి, జడ్డా.రవి,దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ సమ్మద్‌భాష, చెన్నారెడ్డి, రావిక్రింధి సుబ్బరత్నం, కే.దానం. చెంచయ్య, శ్రీనివాస్‌యాదవ్‌, ఇస్మాయిల్‌, భాషా, దొడ్డా వెంకటేశ్వర్లు, పత్తి కాశయ్య, యిప్పెర్ల శేషయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T07:19:46+05:30 IST