పోతిరెడ్డి పాడును అడ్డుకుంటాం : ఎల్లేని
ABN , First Publish Date - 2020-08-10T10:46:06+05:30 IST
పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టును అడ్డుకు తీరు తామని బీజేపీ జిల్లా అధ్యక్షడు ఎల్లేని సుధాకర్ రావు హెచ్చరించారు.
కొల్లాపూర్ రూరల్, ఆగస్టు9: పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టును అడ్డుకు తీరు తామని బీజేపీ జిల్లా అధ్యక్షడు ఎల్లేని సుధాకర్ రావు హెచ్చరించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని సోమశిలలో కార్యకర్తలతో కలసి జలదీక్ష చేపట్టారు. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు చేపట్టినా రాష్ట్రప్రభుత్వం పట్టించు కో వడం లేదన్నారు. దక్షిణతెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. కొవి డ్-19 నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన జలదీక్షను పోలీసులు భగ్నంచేశారు.