చేనేత సమస్యలపై సంఘటితంగా ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2022-01-20T06:18:37+05:30 IST

చేనేత సమస్యల పరిష్కారానికి కోసం రాజకీయాల కతీతంగా సంఘటితంగా ఉద్యమిద్దాం అని భూదాన్‌పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు భారత పురుషోత్తం పిలుపునిచ్చారు. భూదాన్‌పోచంపల్లిలోని బుధవారం జరిగిన పద్మశాలి చేనేత కార్మిక చీరల ఉత్పత్తిదారుల సంఘం 14వ వార్షిక మహాసభలో ఆయన మాట్లాడారు. రో

చేనేత సమస్యలపై సంఘటితంగా ఉద్యమిద్దాం
మహాసభలో మాట్లాడుతున్న భారత పురుషోత్తం

భూదాన్‌పోచంపల్లి, జనవరి 19: చేనేత సమస్యల పరిష్కారానికి కోసం రాజకీయాల కతీతంగా సంఘటితంగా ఉద్యమిద్దాం అని భూదాన్‌పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు భారత పురుషోత్తం పిలుపునిచ్చారు. భూదాన్‌పోచంపల్లిలోని బుధవారం జరిగిన పద్మశాలి చేనేత కార్మిక చీరల ఉత్పత్తిదారుల సంఘం 14వ వార్షిక మహాసభలో ఆయన మాట్లాడారు. రోజురోజుకూ నూలు, రంగులు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా చేనేత కార్మికులకు గిట్టుబాటు లభించడం లేదని, కుదేలవుతున్న చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. చేనేత సమస్యలపై నాయకులు, కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు. రుద్ర శ్రీశైలం అధ్యక్షతన ఈ మహాసభలో చేనేత రాష్ట్ర నాయకులు తడక వెంకటేష్‌, మాజీ ఎంపీపీ బడుగు దానయ్య, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేష్‌, గుండు పరమేష్‌, చిట్టిపోలు శ్రీనివాస్‌, బడుగు చండికేశ్వర్‌, సీత దామోదర్‌, అంకం మురళి, గుజ్జ సత్యనారాయణ, సూరపల్లి రమేష్‌, కస్తూరి సుదర్శన్‌, సంగెం చంద్రయ్య, కడవేరు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:18:37+05:30 IST