ప్రభుత్వ బడుల పరిరక్షణకు కలిసి పనిచేద్దాం
ABN , First Publish Date - 2021-06-17T05:30:00+05:30 IST
ప్రభుత్వ బడుల పరిరక్షణకు కలిసి పనిచేద్దాం
- డీఈవో సుశీందర్రావును కలిసిన స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా నాయకులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): ప్రభుత్వ బడుల పరిరక్షణకు కలిసి పనిచే ద్దామని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. గురువారం స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా నాయకులు డీఈవోను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎసీఈ్టయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమణి, ప్రవీణ్కుమార్ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ బడుల పై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా ఉపాధ్యాయు లు పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయుల స మస్యల పరిష్కారానికి సంఘాలకు సహకరిస్తాన న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త అధ్యక్షులు కృష్ణారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు వెదిరె కృష్ణారెడ్డి, ఏఐఎస్టీఎఫ్ సభ్యులు భాస్కర్ పాల్గొన్నారు.