AP News: టీడీపీని గెలిపిద్దాం..రాష్ట్రాభివృద్ధికి సహకరిద్దాం : బొరగం శ్రీనివాసులు
ABN , First Publish Date - 2022-08-24T02:19:47+05:30 IST
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): సీఎం జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరిట స్థాయికి మించిన అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాడని విమర్శించారు. పోలవరం మండలం జిల్లెలిగూడెం పంచాయతీ పరిధిలో
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): సీఎం జగన్ (CM Jagan) పాలనలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పోలవరం (Polavaram) నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరిట స్థాయికి మించిన అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాడని విమర్శించారు. పోలవరం మండలం జిల్లెలిగూడెం పంచాయతీ పరిధిలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచేసి సామాన్యుడి జీవితాన్ని దుర్భరంగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రం అప్పుల నుంచి గట్టేకాలంటే టీడీపీని గెలుపించుకోవడం ఒక్కటే మార్గమని, రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ (TDP) మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, గ్రామ అధ్యక్షులు రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి నూనకానీ రాంబాబు, సవలం శ్రీను, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోతుల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కోవ్వాసి శ్రీను, మీసాల పోశిరావు, మాగంటి రాము, మజ్జి అప్పారావు, రెల్లి కొండబాబు, పిల్లి నాగరాజు, భాషా, ఏసు, సున్నం సుధీర్, ఏలూరు పార్లమెంట్ ఐటీడీపీ అధికార ప్రతినిధి జల్లేపల్లి జితేంద్ర, గుబ్బా రాంబాబు, ఇల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.