హిందీ తెలియకపోవడం భారతీయతను తగ్గించబోదు : ఎస్ఎం కృష్ణ
ABN , First Publish Date - 2020-08-11T23:38:15+05:30 IST
హిందీ తెలియకపోవడం భారతీయుడయ్యేందుకు అర్హతను తగ్గించబోదని కర్ణాటక మాజీ
బెంగళూరు : హిందీ తెలియకపోవడం భారతీయుడయ్యేందుకు అర్హతను తగ్గించబోదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ అన్నారు. చెన్నై విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ కనిమొళికి ఎదురైన పరిస్థితి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘అనేక భారతీయ భాషల్లో హిందీ అనేది ఒకటి’’ అన్నారు. హిందీని జాతీయవాదంతో సమానంగా పరిగణించవద్దని చెప్పారు.
కనిమొళి ఆదివారం ఇచ్చిన ట్వీట్లో, తనకు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. తనకు హిందీ తెలియకపోవడంతో ఓ సీఐఎస్ఎఫ్ అధికారి తనను ఉద్దేశించి, ‘‘మీరు భారతీయురాలేనా?’’ అని అడిగారని చెప్పారు. తాను ఆ అధికారిని తమిళంలో కానీ, ఇంగ్లిష్లో కానీ మాట్లాడాలని కోరినపుడు తనకు ఈ ప్రశ్న ఎదురైందన్నారు.