ఆడబిడ్డలను దేశం గర్వపడేలా ఎదగనిద్దాం: షర్మిల
ABN , First Publish Date - 2022-01-25T07:11:39+05:30 IST
పురుడు పోసుకోక ముందే చిదిమేయకుండా, అత్యాచారాలను
హైదరాబాద్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పురుడు పోసుకోక ముందే చిదిమేయకుండా, అత్యాచారాలను అరికడుతూ.. దేశం గర్వపడే స్థాయికి ఎదిగే అవకాశాన్ని ప్రతి ఆడబిడ్డకూ కల్పిద్దామని వైఎ్సఆర్టీపీ అధినేత్రి షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. కాగా, వైఎ్సఆర్టీపీకి సంబంధించిన అన్ని కమిటీలను ఆ పార్టీ అధినేత్రి షర్మిల సోమవారం రద్దు చేశారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ములుగు, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు.