ఎన్ని జైళ్లలో పెడతారో చూస్తాం: Revanth Reddy

ABN , First Publish Date - 2021-07-15T20:48:43+05:30 IST

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఎన్ని జైళ్లలో పెడతారో చూస్తాం: Revanth Reddy

హైదరాబాద్: పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ధరలపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిర్బంధించాలని చూస్తే పోలీస్‌స్టేషన్లను ముట్టడిస్తామన్నారు. ఎన్ని జైళ్లలో, ఎన్ని స్టేషన్‌లలో పెడతారో చూస్తామన్నారు. పెట్రోల్, డీజిల్‌, గ్యాస్‌పై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కలిసి 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్‌రెడ్డి తెలిపారు.



Updated Date - 2021-07-15T20:48:43+05:30 IST