తెలుగు భాషను పరిరక్షించుకుందాం
ABN , First Publish Date - 2021-02-24T04:43:12+05:30 IST
ప్రతి ఉపాధ్యాయుడు తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తూ రక్షించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్ పిల్లి రామకృష్ణ అన్నారు.
పెనగలూరు, ఫిబ్రవరి23 : ప్రతి ఉపాధ్యాయుడు తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తూ రక్షించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్ పిల్లి రామకృష్ణ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం కొండూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సిరివరం యు.పి.స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు కె.రాజశేఖర్రెడ్డిని కొండూరు కాంప్లెక్స్ టీచర్స్అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఏ.శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఏ.ప్రశాంత్, సరసక్క, నరసింహులు, శ్రీనివాసులు, సీఆర్పీ నరసింహులు పాల్గొన్నారు.