రాష్ట్రాన్ని హరితశోభితంగా తీర్చిదిద్దుదాం

ABN , First Publish Date - 2022-08-09T06:54:47+05:30 IST

రాష్ట్రాన్ని హరితశోభితంగా తీర్చిదిద్దుదాం

రాష్ట్రాన్ని హరితశోభితంగా తీర్చిదిద్దుదాం
ఏపీజీబీసీ సంస్థ కార్యాలయం వద్ద మొక్క నాటుతున్న సంస్థ చైర్మన్‌, డైరెక్టర్లు

విజయవాడ ఆగస్టు 8, (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో, పట్టణాల్లో జగనన్న హరిత నగరాల పథకం అమలు బాధ్య తను ఏపీజీబీసీకి ప్రభుత్వం అప్పగించింది. రహదార్లకు ఇరువైపులా, మధ్య భాగాల్లో మొక్కలను నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి, రాష్ర్టాన్ని హరితశోభితంగా తీర్చిదిద్దుదాం.’ అని ఆంధ్రప్రదేశ్‌ పచ్చదనం, సుందరీకరణ సంస్థ(ఏపీజీబీసీ) చైర్మన్‌ ఎన్‌.రామారావు పిలుపునిచ్చారు. ఏపీజీబీసీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశాన్ని సోమవరం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన పచ్చ దనాన్ని అందించడమే ధ్యేయంగా సంస్థ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.రాజశేఖరరెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-09T06:54:47+05:30 IST